• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో ‘కల్తీకి కళ్లెం’ వేస్తున్న అధికారులు

VKB: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలకు, అక్రమ రవాణాకు అధికారులు కళ్లెం వేస్తున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు కల్తీ ఆహార పదార్థాలతో పాటుగా అక్రమ ఇసుక, కలప, మట్టి దందాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 48 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

March 28, 2026 / 08:34 AM IST

హాస్టల్ భోజనంలో బల్లి.. విద్యార్థులు ఆందోళన

HNK: భీమారంలోని SVS జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శశాంక బాయ్స్ హాస్టల్‌లో శుక్రవారం సాయంత్రం భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విద్యార్థులు ఫుడ్ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు భోజనాన్ని తనిఖీ చేసి..రూ.15,000 జరిమానా విధించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

March 28, 2026 / 08:34 AM IST

రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య

WGL: వరంగల్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. హంటర్ రోడ్ సంతోష్ మాత దేవాలయం ఎదుట విశాఖ వెళ్తున్న ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ కింద పడి రాజస్థానీ యువకుడు జోధారామ్ (30) మృతి చెందాడు. అలాగే ధర్మారం రైల్వే గేట్ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తుతెలియని యువకుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.

March 28, 2026 / 08:33 AM IST

చెరువులోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

KMR: మద్యానికి బానిసై వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన అన్నారం యాదగిరి(53)అనే వ్యక్తి భార్య కళావతి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఆయన మద్యానికి బానిసై డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

March 28, 2026 / 08:33 AM IST

నేడు ధర్‌పల్లి సహకార సంఘం సర్వసభ్య సమావేశం

NZB: ధర్‌పల్లి PACS కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీ. సంతోష్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండో పరిధిలోని సభ్యత్వం కలిగిన గ్రామాల రైతులందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు. 6 నెలల కాలానికి సంబంధించిన జమ, ఖర్చుల వివరాలను ఈ సందర్భంగా సభ్యులకు వివరించనున్నారు.

March 28, 2026 / 08:33 AM IST

ఇసుక లేక నిలిచిపోతున్న ఇళ్ల నిర్మాణాలు

జన్నారం మండలంలో ఇసుక సరఫరా లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని ప్రజలు తెలిపారు. ట్రాక్టర్ యజమానులు, మేస్త్రీలు, కూలీలు ఉపాధి కోల్పోయారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండడంతో పది కిలోమీటర్ల వరకు ఇసుక సేకరణను నిలిపివేసినట్లు అటవీ అధికారులు చెప్పారు. గోదావరి తీరంలో కూడా సేకరణను నిలిపివేశారు. మండలంలో దాదాపు ఇసుక సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంటి యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు.

March 28, 2026 / 08:29 AM IST

నేడు జాతీయ మెగా లోక్ అదాలత్

MDK: నేడు జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరస్పర చర్చల ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:28 AM IST

‘ఎంపీ డీకే అరుణ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి’

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమాలకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు.

March 28, 2026 / 08:25 AM IST

మహేశ్వరం మహిళా కానిస్టేబుల్ ‘వసూళ్ల’ పర్వం!

RR: మహేశ్వరం పరిధిలో ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ శ్రీదేవి అనే కానిస్టేబుల్ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం వాహనాలను ఆపి తనిఖీల పేరుతో నగదు వసూలు చేస్తున్నారని, అడిగినంత ఇవ్వకపోతే వాహనాలను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు.

March 28, 2026 / 08:21 AM IST

‘చలో అసెంబ్లీ’ భగ్నం.. ఆశా కార్యకర్తల అరెస్ట్

KNR: తమ సమస్యల పరిష్కారం కోసం ‘చలో అసెంబ్లీ’కి వెళ్తున్న జిల్లా ఆశా కార్యకర్తలను పోలీసులు రేణికుంట టోల్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేసి వారిని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శాంతియుత నిరసనను అడ్డుకోవడం అన్యాయమంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధకాండతో టోల్‌గేట్ పరిసరాల్లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

March 28, 2026 / 08:21 AM IST

ప్లాస్టిక్ రహిత అడవుల కోసం అటవీ శాఖ తనిఖీలు

NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూర్ చెక్‌పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు. వాహనాలను తనిఖీ చేస్తూ పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల రక్షణ కోసం అడవిలోకి ప్లాస్టిక్ తీసుకురావద్దని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.

March 28, 2026 / 08:21 AM IST

DTF నూతన మండల అధ్యక్షుడిగా..రామ్ సింగ్

BHPL: మహాముత్తారం మండల DTF నూతన కమిటీని రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా జాటోత్ రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్‌, ఉపాధ్యక్షులుగా భాస్కర్, రత్నకుమారి, రాజేంద్రన్, తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. DTF సంఘం సమస్యలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 28, 2026 / 08:20 AM IST

ఉత్తమ భాషా పండితులుగా జిల్లా నుంచి ఆరుగురు ఎంపిక

WGL: తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఉగాది పురస్కారాలకు WGL జిల్లా నుంచి ఉత్తమ భాషా పండితులను ఎంపిక చేసింది. ఖిలా WGLకు చెందిన నరేష్, నందిగామకు చెందిన అనురాధ, ఏనుగల్లుకు చెందిన మజాహార్‌, అభీదా తబస్సుమ్, షాహిన్, అనిత ఈ పురస్కారాలకు ఎంపికైనట్లు వారు వెల్లడించారు. రేపు HNKలో జరిగే పరాభవ ఉగాది వేడుకల్లో వీరికి అవార్డులు అందజేయనున్నారు.

March 28, 2026 / 08:19 AM IST

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

SRD: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టుల వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేశారు. మద్యం, గంజాయి, అక్రమ ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

March 28, 2026 / 08:19 AM IST

యాంటీబయోటిక్స్‌పై ప్రతిఘటిస్తున్న బ్యాక్టీరియా..!

HYD కేంద్రంగా CCMB సూపర్ బగ్స్‌‌పై కీలక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా వ్యర్థ జలాలలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వ్యాప్తిపై తొలి సమగ్ర నివేదిక విడుదలైంది. నీటిలో యాంటీబయోటిక్స్ కలిపినప్పుడు బ్యాక్టీరియా జీన్స్ మార్పులతో గోడలను బలపరచడం, ఔషధాన్ని బయటకు త్రోసేయడం, నాశనం చేయడం ద్వారా ప్రతిఘటిస్తున్నట్లు గుర్తించారు. ఇది భవిష్యత్‌లో సవాలుకానుంది.

March 28, 2026 / 08:15 AM IST