NGKL: అమ్రాబాద్ మండలం దోమలపెంట ఎస్ఎల్బీసీ వద్ద ఇటీవల జరిగిన ప్రమాద స్థలాన్ని నేడు గురువారం మాజీ మంత్రి హరీష్ రావు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉ.9 గంటలకు హాజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోవాలని కోరారు. అక్కడి నుంచి దోమలపెంట ఎస్ఎల్బీసీకి బయలుదేరనున్నట్లు వారు తెలిపారు.