HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు చేసిన కాల్ కలకలం రేపింది. మెయిన్ కంట్రోల్ నుంచి గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో హోటల్ మొత్తం తనిఖీలు చేపట్టారు. హోటల్లో ఉన్న కస్టమర్లందరినీ బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.