• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుడికి ఘన నివాళి

SRPT: తిరుమలగిరిలోని 2వ వార్డుకి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మాజీ వార్డు మెంబర్ పులిగిల్ల యాదగిరి గుండెపోటుతో మరణించడంతో ఆదివారం ఆయన పార్థివదేహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకేపల్లి నరోత్తం రెడ్డి, జయచందర్, యాదగిరి, నరేష్ ఉన్నారు.

February 22, 2026 / 01:35 PM IST

ఆలయానికి పోటెత్తిన భక్తులు

RR: చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అఖండ హారతి జాతర ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు బారులు తీరడంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

February 22, 2026 / 01:34 PM IST

గ్రేటర్‌కు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా

HYD: నగర వాసులకు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దీనికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోమేటిక్ సోలార్ ఎలక్ట్రో క్లోరినేషన్ పద్ధతిని ఉపయోగించనున్నారు. వివిధ నదుల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇంటింటికీ సరఫరా చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని ద్వారా నాణ్యమైన నీటిని సరఫరా అవుతుందని అధికారులు అన్నారు.

February 22, 2026 / 01:33 PM IST

నూతన రైస్ మిల్లును ప్రారంభించిన మంత్రి సీతక్క

MLG: వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైస్ మిల్‌ను ఇవాళ రాష్ట్ర మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రైస్ మిల్ వ్యాపారంలో రాణించి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 01:32 PM IST

‘పసిబిడ్డ మృతి.. అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలి’

MBNR: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బ్రహ్మోత్సవాలలో భాగంగా దైవదర్శనానికి వెళ్తున్న రజక కుటుంబంపై దాడి చేసి పసిబిడ్డ మృతికి కారణమైన అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలని పలువురు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయానికి బాధ్యత వహించాలన్నారు.

February 22, 2026 / 01:32 PM IST

జాతరకు వేళాయే….పనులేమో కాకపాయె..!

WGL: గీసుకొండ మండలం శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3 నుంచి 7వరకు వరకు జరిగే ప్రధాన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే జాతరకు సమయం దగ్గర పడుతున్నా రూ.1.45 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.

February 22, 2026 / 01:31 PM IST

ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగర్‌లో నూతన SVK ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ హాల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:30 PM IST

మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి

KMM: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. సత్యనారాయణపురంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఆయన, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.

February 22, 2026 / 01:30 PM IST

‘రేపటి నుంచి న్యాయవాదుల పాదయాత్ర’

MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రేపటి నుంచి పాదయాత్ర చేబుతున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి యాత్రకు న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 01:29 PM IST

తుర్కపల్లికి తహసీల్దార్ రవికుమార్

BHNG: తుర్కపల్లి మండల తహసీల్దార్‌గా రవికుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ జలకుమారి కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ను తుర్కపల్లి తహసీల్దార్‌గా నియమించారు. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో తహసీల్దార్ సేవలందించిన ఆయనను మరోసారి ఇక్కడికే నియమించడం విశేషం.

February 22, 2026 / 01:27 PM IST

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: స్థానిక ప్రాక్టీసింగ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి రూమ్‌కు వెళ్లి ఆయన పరిశీలించారు. మాస్ కాపీ జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని చెప్పారు.

February 22, 2026 / 01:26 PM IST

10వ వార్డు కౌన్సిలర్ ఆవేదన

NRPT: మద్దూర్ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గోవిందు ముదిరాజ్ ప్రెస్ మీట్లో తనకు ఛైర్మన్ పదవి ఇస్తామని ఏనుముల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఎవరూ.. హామీ ఇవ్వలేదని తెలిపారు. ఛైర్మన్ అవుతాననే నమ్మకంతోనే కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశానన్నారు. బీఆర్ఎస్ నాయకుల విమర్శ తగదని, పార్టీ తుది నిర్ణయమే తన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 01:25 PM IST

మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

HYD: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బాన్సువాడ బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను బాన్సువాడకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్‌ను మండల బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు.

February 22, 2026 / 01:24 PM IST

రేపు సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం

WNP: సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయరాములు తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే జిల్లాలోని ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

February 22, 2026 / 01:24 PM IST

​రేపటి నుంచి సూర్యాపేటలో ‘ప్రజావాణి’

SRPT: ​మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయంలో యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

February 22, 2026 / 01:22 PM IST