ఖమ్మం: కూసుమంచి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలగూడెంలో కరెంట్ షాక్తో తాటికొండ రామారావు అనే రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనులు నిమిత్తం పొలానికి వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.