వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. గతంలో ఎంపికైన విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాలని, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు scholarships.gov.in వెబ్సైట్లో ఈ నెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.