VZM: ఈనెల 5న బొబ్బిలిలో జరిగే PGRSలో ఎమ్మెల్యే బేబినాయన పాల్గొంటారని స్దానిక MPDO రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు శాఖా పరమైన నివేదికతో SD స్థాయి అధికారులతో పాటుగా తప్పనిసరిగా ఉ. 9.30కి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. గైర్హాజరైన అధికారులకు కలెక్టర్ ఆదేశాలు మేరకు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.