MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలోని ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ మాజీ సర్పంచ్ మంద అనిత సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం సమర్పించారు. కొందరు అక్రమార్కులు రాత్రివేళ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని అనిత తెలిపారు.