WGL: ఉమ్మడి జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు 3 నెలలకు సరిపడే బియ్యాన్ని ఒకేసారి అందజేయాలని అధికారులు నిర్ణయించారు. వేసవి ఎండల తీవ్రత కారణంగా కార్డుదారులు తరచూ క్యూలో నిలబడాల్సిన ఇబ్బందులు తప్పించడమే ఈ చర్య లక్ష్యమని తెలిపారు. అయితే 3 నెలల బియ్యాన్ని ఒకేసారి నిల్వ చేయడం కష్టమవుతుందని కొందరు రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.