మహబూబ్ నగర్ రూరల్ మండలం తెలుగు గూడెం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత రామచంద్రయ్య మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, అహింసతోనే విజయం సాధ్యమని పేర్కొన్నారు.