WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 6,950 పలకగా నేడు రూ.50 తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ. 6,900 ధర పలికింది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్కు సరుకులు తీసుకుని రావాలని, తేమలేని నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.