KMM: సీఐటీయూ నేలకొండపల్లి మండల కన్వీనర్గా మరోసారి పగిడికత్తుల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నేలకొండపల్లిలోని రావెళ్ళ సత్యం భవనంలో జరిగిన మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని పేర్కొన్నారు.