KMM: వేసవి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ను కలిశారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు, కూలీల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.