KMM: స్వాతంత్రోద్యమ కాలంలో దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ ఖమ్మం వచ్చారు. 1946లో ఖమ్మం మెట్టులోని పెద్ద గేటు వద్ద రైలు దిగారు. ఆయన రాకతో ఉద్యమకారులు పెద్ద ఎత్తున చేరుకుని మహాత్ముడి ప్రసంగాన్ని విన్నారు. ఆయన పేరు మీదనే ఖమ్మం గాంధీ చౌక్ ఏర్పడింది.