KMM: జిల్లా సంక్షేమ అధికారి(మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ)గా వేల్పుల విజేత బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం డీడబ్ల్యూఓగా ఉన్న కె.రాంగోపాల్ రెడ్డిని డిప్యూటేషన్పై డిజేబుల్డ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. దీంతో మహిళా ప్రాంగణం మేనేజర్ విజేతకు డీడబ్ల్యూఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో శనివారం ఆమె విధుల్లో చేరారు.