కరీంనగర్లో అట్టహాసంగా మహిషాసుర సంహారం నిర్వహించారు. మహాశక్తి ఆలయం వద్ద మహిషాసురుడి దిష్టిబొమ్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ దహనం చేశారు. ధర్మరక్షణ కోసం చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పర్వదినం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అధర్మానికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడే వారిపై అంతిమ విజయం ధర్మానిదేకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.