RR: రేపు గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలతో పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ప్రియులు షాద్నగర్ లోని పలు మద్యం దుకాణాలకు పోటెత్తారు. మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్ను కూడా కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.