ADB: ఉట్నూర్ మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ముక్తాబాయికి శనివారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ(EMT) దత్తాత్రేయ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను 108 వాహనంలో ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పైలట్ బాపురావ్ తెలిపారు.