ADB: తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి జక్కుల సదాశివ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణ, చంద్రకాంత్, నారాయణ, వామన్ పటేల్, సదానందం తదితరులున్నారు.