మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ జానకి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నిరంతరం పోలీస్ తనిఖీలు ఉంటాయన్నారు. నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా ఉంచామని వెల్లడించారు.