NLG: భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరిస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలో విద్యార్థి, యువజన స్మారకోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 23 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు మల్లం మహేష్, శంకర్ మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయ సాధన కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు.