PDPL: కేంద్రాలలో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ డి వేణు మంథని మండలంలోని పవర్ హౌస్ కాలనీ, అంగళూరు, గుంజ పడుగు, నాగారం గ్రామాలు, రామగిరి మండలంలో సుందిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.