NLG: ఈ నెల 15 వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.TG రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సోమవారం NLG జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులతో నిర్వహిస్తున్న సమీక్ష సందర్భంగా సోమవారం ప్రజావాణి ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు.