NRML: కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గా భవాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.