KMR: పట్టణంలోని పలు కాలనీలలో బుధవారం ఉదయం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మేఘావృతమై చీకటి ఆవరించిన వేళ, కరెంటు లేకపోవడంతో గృహిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పనులకు వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా అవస్థలు పడ్డారు. విద్యుత్ అంతరాయానికి కారణాలు తెలియరాలేదు. అధికారులు వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని స్థానికులు కోరారు.