JN: జనగామ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి ప్రజల నుంచి 157 అర్జీలను స్వీకరించారు. వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.