మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హింస ద్వారా ఎటువంటి విజయం సాధించలేమని, అహింస ద్వారానే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి గాంధీ అని పేర్కొన్నారు.