ADB: పట్టణంలోని బీసీ సంఘ భవనంలో పీఆర్టీయు తెలంగాణ సంఘం నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాధ్యక్షుడు నూర్ సింగ్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల స్థానంలో ఇస్తున్న డిప్యూటేషన్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.