నిర్మల్: కిస్టాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు అసెంబ్లీ కన్వీనర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఎన్నుకున్న 201 బూత్ కమిటీ సభ్యులను సన్మానించనున్నారు.