మేడ్చల్: జిల్లాలో 995 ప్రైవేటు ఆస్పత్రులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,835 ఆస్పత్రులు ఉంటే కేవలం 2,840కి మాత్రమే అనుమతులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ఉమాగౌరి మాట్లాడారు. అనుమతి లేని ఆస్పత్రులపై ఫిర్యాదు చేస్తే తనిఖీ చేసి, చర్యలు తీసుకుంటామన్నారు.