NZB: ఆలూరు మండలం డికంపల్లికి చెందిన తంబాకు భరత్ మండల బీజేవైఎం అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం నియామకపత్రం అందజేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. పని చేసిన వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.