NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని కొత్త కుంట పాపర్ల పాడు తండాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పార్టీలోకి వస్తున్నారని అన్నారు.