NGKL: అమ్రాబాద్లో శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటించనున్నారని కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సందర్భంగా మన్ననూరులో నూతన ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన చేయనున్నారన్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్య కర్తలు పాల్గొనాలని సూచించారు.