సత్యసాయి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరిలో ‘మన ఇంటికి-మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా 20వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన పథకాల గురించి ప్రజలకు వివరించారు. వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.