మేడ్చల్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై CBI విచారణ చేపిస్తేనే అసలైన దోషులు బయటపడతారని ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనేకమంది నేతలు వ్యక్తిగతంగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ చర్యలు మాత్రం రోజురోజుకు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అనేక మందితో ఇది ముడిపడి ఉన్నట్లు శుక్రవారం పేర్కొన్నారు.