ATP: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని హాల్లో NCORD జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో మాదకద్రవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.