BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఏల్చూరు గ్రామానికి చెందిన వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏల్చూరు టోల్ ప్లాజా అంబులెన్స్లో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.