E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ప్రతి విజ్ఞాపనపై తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.