KMR: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. శుక్రవారం పెద్ద కొడఫ్గల్లోని తహాసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, పొరపాట్లకు చోటు ఉండకూడదని సూచించారు.