MBNR: షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ఎక్లాస్ ఖాన్పేట్లో నిర్వహించే ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు గదుల భూమి పూజ చేయనున్నారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.