RR: కాటేదాన్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ మహిళను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం నిర్వహించిన దాడుల్లో ఆమె వద్ద నుంచి 870 గ్రాముల గంజాయి చాక్లెట్లు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను బీహార్ రాష్ట్రం నుంచి తీసుకువచ్చినట్లు నిందితురాలు అంగీకరించింది. పట్టుబడిన సొత్తుతో పాటు ఆమెను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.