NLG: జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి చేలకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. వర్షాలకు పత్తి చేలంతా ఎర్రబారి ఆకులు కాయలు రాలిపోతున్నాయి. దీంతో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి,కనగల్ మండలాల్లో పత్తి చేలకు తెగుళ్లు వచ్చాయి.