BDK: ఇల్లందు వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం MLA కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులను కలిసి మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై పలు సూచనలు చేశారు. రైతాంగానికి మందులు అందించే విషయంలో అధికారులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.