NDL: చేప పిల్లల ఉత్పత్తికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సీపీఐ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు.1990లో 5 ఎకరాలు చేప పిల్లల ఉత్పత్తి కోసం కేటాయించిన భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.