SRPT: మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలని ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ఆధునిక కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో పాటు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయని పిల్లలు మొబైల్ ఫోన్ వినియోగించకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.