NGKL: జిల్లాలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. అటు వాహనాల వేడి, ఇటు నెత్తిన మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.