WGL: కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని BRS రాష్ట్ర నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు. పర్వతగిరి మండల BRS సోషల్ మీడియా కన్వీనర్, చింత నెక్కొండ గ్రామ నివాసి నరేశ్ తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న రాకేశ్ రెడ్డి ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులు అర్పించారు.