JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హైకోర్టు రిజిస్టర్ రవీంద్ర శర్మ, సురేఖ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు స్వామివారి శేషవస్తాలతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో గోపిరాం, ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.