మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. JAN 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి 2:10 గంటల రన్ టైం లాక్ అయినట్లు టాక్. ఇక ఈ మూవీలో ఆషికా రంగనాథన్, డింపుల్ హయతి కీలక పాత్రలు పోషించారు.