NRML: నిర్మల్లోని బస్టాండ్ సమీపంలో 2024లో ఓ వ్యక్తి నుంచి బంగారు గొలుసు, మొబైల్ దోచుకున్న నిందితులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ మేరకు తీర్పునిచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీ వినోద్ రావు, పోలీసు అధికారులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.